"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, January 08, 2006

సాగర్‌కు పెరిగిన బౌద్ధులతాకిడి


న్యూస్‌టుడే, మాచర్ల
అమరావతిలో కాలచక్ర ఉత్సవాలు ప్రారంభమై నాలుగు రోజుల గడవడంతో బౌద్ధులు నాగార్జునసాగర్‌కు వందలాదిగా తరలివస్తున్నారు. నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలను అపురూపంగా పరిశీలిస్తున్నారు. అమరావతి నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులు, ప్రవేటు వాహనాలలో నాగార్జునసాగర్‌ చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున 5 గంటలకే సాగర్‌ చేరే యాత్రికులు రాత్రి 10 గంటల వరకు అక్కడే గడిపి వెనుదిరుగుతున్నారు.

అనుపు నుంచే లాంచీలు
లక్షలాది రూపాయలు వెచ్చించి లాంచీ స్టేషన్‌ నాగార్జునసాగర్‌లో నిర్మించినా సమయం కలిసి వస్తుండటంతో లాంచీ స్టేషన్‌ కాస్తా అనుపు వద్దకు మారింది. సాగర్‌ నుంచి 50 నిమిషాలు పట్టే ప్రయాణం, అనుపు నుంచి 25 నిమిషాలే పడుతుంది. ఈ నెల 35 బౌద్ధమత గురువు దలైలామా అనుపు నుంచే నాగార్జునకొండ చేరుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచే లాంచి ప్రాయాణాలు సాగుతున్నాయి. అయితే ఈ సమాచారం తెలియక అనేక మంది బౌద్ధులు తికమక పడుతున్నారు.

బోధి మొక్క వద్ద ప్రదక్షణలు
ఈనెల 3న దలైలామా నాగార్జునకొండలో నాటిన బోధి మొక్క వద్ద బౌద్ధులు భక్తి పారవశ్యంతో మొక్కుతున్నారు. తమ ఆరాధ్య దైవం నాటిన మొక్క దైవంతో సమానంగా మొక్కుతున్నారు. దలైలామా ప్రార్థనలు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. మ్యూజియంలో ఉన్న అద్భుత సంపద చూసి ఔరా అంటున్నారు.

నింగినంటిన తినుబండారాల ధరలు
భక్తితో వచ్చిన బౌద్ధులకు సాగర్‌, అనుపులో పలువురు వ్యాపారులు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నారు. బౌద్ధులకు భాషా సమస్య ఉండటంతో వ్యాపారులు ఆడిందే ఆటగా సాగుతోంది. రూ.12ల వాటర్‌ బాటిల్‌ రూ.20కు, రూ.7 ఉండే శీతల పానీయం బాటిల్‌ రూ.10 నుంచి రూ.12కు విక్రయిస్తున్నారు. ఇక ఇడ్లి, పూరి, వడ వంటి ధరలు సరేసరి. వచ్చిన కాడికి వసూలు చేస్తున్నారు. స్నాక్స్‌, పండ్ల ధరలు అధికమే.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home