శాంతా కుమారి అస్తమయం

తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు. 1999వ సంవత్సరానికి గాను ఆమె 'రఘుపతి వెంకయ్య అవార్డు'ను అందుకున్నారు. ఎన్టిఆర్ జయంతి సందర్భంగా సినీ కళాకారులకు ఇచ్చే 'కళా నీరాజన' పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు. పద్మశ్రీ పిక్చర్స్, రాగిణి పిక్చర్స్ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్గా ప్రధా న పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం. శాంతకుమారికి రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనుమడు లండన్ నుంచి రాగానే బుధవారం సాయంత్రం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Courtesy: ఆంధ్ర జ్యోతిKeywords: Shanta Santa Kumari Santakumari , Telugu , Andhra Pradesh , movie film tollywood , music playback singer , Andhra Jyothi January 2006
0 Comments:
Post a Comment
<< Home