"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, January 11, 2006

పంచ ధర్మాల పాలన... ప్రకృతి పరిరక్షణ



పంచ ధర్మాల పాలన... ప్రకృతి పరిరక్షణ
బౌద్ధులకు దలైలామా బోధిచిత్త ప్రవచనం
స్వార్థబుద్ధే సమస్యలకు మూలం
సంఘ దృష్టి విశ్వశాంతి మంత్రం
అమరావతి నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధి

'బౌద్ధమతావలంబకులు ప్రతిఒక్కరూ ప్రపంచ మానవాళికి మేలుచేకూర్చే పంచధర్మాలు పాటించాలి. ప్రకృతిని పరిరక్షించాలి. ఇందుకు చేసే కృషి శాశ్వతమైన ప్రయోజనం చేకూరుస్తుంది. జన్మకు సార్థకత కలుగుతుంది' అంటూ దలైలామా ప్రవచించారు. అమరావతిలో నిర్వహిస్తున్న 'కాలచక్ర' ఉత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఆయన 'బోధిచిత్త' గురించి ఉపన్యసించారు. వికాసశీలమైన బుద్ధిని, ఆచరణయుక్తమైన జ్ఞానాన్ని అలవరుచుకోవడమే బోధిచిత్త సారాంశంగా స్పష్టీకరించారు. ప్రవచనాలకు హాజరైన వేల మంది చేత పంచధర్మ ప్రతిజ్ఞను చేయించారు. దొంగతనం చేయకుండా ఉండడం, అసత్యమాడకుండడం, ప్రాణహరణ చేయకుండడం, అనైతిక ప్రవర్తనకు దూరంగా ఉండడం, పదార్థాలను, ప్రకృతిని విషతుల్యం చేయకుండడం అనే అయిదు అంశాలపై దలైలామా అందరిచేతా ప్రమాణాలు చేయించారు. వీటిని జీవితకాలంలో తప్పకపాటించాలని ఉపదేశించారు. స్వార్థ చింతన, కీర్తికండూతి అన్ని సమస్యలకు మూలమవుతోందన్నారు. 'స్వార్థం నుంచి అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం పుడుతున్నాయి. దాంతో మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఘర్షణలకు, ప్రాణహరణకు ఇవే కారణమవుతున్నాయి. అందువల్ల స్వార్థాన్ని జయించి, సంఘ దృష్టిని అలవరుచుకుంటే ప్రపంచం శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంద'ని ఉద్బోధించారు. 'బౌద్ధ సిద్ధాంతం ప్రకారం అన్ని జన్మల్లో మనిషి పుట్టుక దుర్లభమైంది. దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నించాలి. ఎన్ని మంచి పనులు చేయగలిగితే అన్ని కార్యాలు చేసి మనిషిగా లభించిన అవకాశాన్ని ప్రతిభావంతంగా వినియోగించుకోవాల'ని దలైలామా సూచించారు. మనిషి నిర్వాణం సాధించేందుకు ముందుగా చేతనను పొందేందుకు కీర్తిపట్ల కోరికను విడనాడాలన్నారు. బోధిచిత్తం మనసులోని స్వార్థరహిత ఆశయాలను నెరవేర్చే సాధనమని ఉద్ఘాటించారు. సానుకూల ఆలోచనలను, మంచి జీవన విధానాన్ని బోధిచిత్తం అలవరుస్తుందన్నారు. ఈ పద్ధతిని ఆకళింపు చేసుకొని, అనుసరించేవారికి ప్రపంచమే శాంతిమయంగా కనిపిస్తుందన్నారు. సమానత్వ సాధన బౌద్ధంలో ప్రధానాంశమన్నారు. ముఖ్యంగా స్వార్థం నుంచి పరమార్థం (ఇతరుల గురించి ఆలోచించే దిశగా) వైపు మనసును మళ్లించే మహత్తర శక్తి, మార్పు సాధన ద్వారా అలవడుతాయన్నారు. ఇతరుల దోషాలను ఎంచే గుణం ఫిర్యాదులకు, వ్యతిరేక ఆలోచనలకు దారితీస్తుందన్నారు. ఎదుటివారిలోని మంచిని మాత్రం స్వీకరించే లక్షణం మనిషిని ఉన్నతంగా నిలుపుతుందని ఉద్బోధించారు.

మాతృమూర్తిని ప్రేమించండి
'అమ్మను ప్రేమించండి. తన గర్భంలో మీరు పెరుగుతున్నప్పుడు ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పుట్టిన తర్వాత మీ కాళ్లపై మీరు నిలబడే వరకూ ఎంతో సేవ చేస్తుంది. అయినా తానెప్పుడూ ఇబ్బందిగా అనుభూతి చెందదు. అందుకే అమ్మను మనస్ఫూర్తిగా ప్రేమించడం నేర్చుకోండి. ఆ ప్రేమ ప్రపంచాన్ని ప్రేమమయంగా చూసేందుకు అవసరమైన హృదయాన్ని మీకు ప్రసాదిస్తుంది' అంటూ దలైలామా దీక్షాబద్ధులైన వేల ప్రజలకు సందేశమిచ్చారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home