తొలి తెలుగు తీర్పు
నిజామాబాద్ న్యాయమూర్తి ఘనత
నిజామాబాద్ - న్యూస్టుడే
నిజామాబాద్ - న్యూస్టుడే

రాష్ట్ర చరిత్రలోనే న్యాయస్థానంలో తొలి తెలుగు తీర్పు బుధవారం వెలువడింది. ఈ ఘనతను నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ సివిల్ న్యాయమూర్తి మంగారి రాజేందర్ (జింబో) సాధించారు. బుధవారం జిల్లా కోర్టులో ఒకకేసు గురించి తెలుగులో తీర్పు చదివిన న్యాయమూర్తి రాజేందర్ తన తెలుగు భాషాభిమానాన్ని చాటారు. అధికార భాషగా తెలుగు అమలులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని న్యాయస్థానంలో ఈ రకంగా తెలుగులో తీర్పు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాహితీప్రియులకు జింబో పేరుతో సుపరిచితులైన రాజేందర్ ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చారు. వాద ప్రతివాదులకు వారి సొంత భాషలో తీర్పును వినిపించిన ఆయన ఆశ్చర్యపరిచారు.
తెలుగులోనే మేలు:
రాజేందర్
రాజేందర్

Courtesy: ఈనాడు
first Telugu judgement court Nizamabad judge Rajendar
1 Comments:
నేను గర్విస్తున్నాను.
Post a Comment
<< Home